కోదాడ లో మార్చి 01 న జిల్లా చెస్ టోర్నమెంట్ క్రీడలు
మార్చి 01న ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కాలేజీలో జిల్లా చెస్ అండర్-15 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెస్ అకాడమీ కన్వీనర్ కె నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి,అర్హత కలిగిన క్రీడాకారులు ముందుగా 300 రూపాయల ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకో వాలని సూచించారు. ఆసక్తిగల చెస్ క్రీడాకారులు 8247075684 నంబరుకు సంప్రదించాలని కోరారు.ఈ చెస్ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు,దృఢత్వం, ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడతాయన్నారు.యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ఈ చెస్ క్రీడలు ముందుకు వెళ్తున్నాయని,చదరంగం ఆట అంటే విజ్ఞాన పరిజ్ఞానం,వ్యూహాత్మకత కళా నైపుణ్యం కలిసి ఉంటాయన్నారు.ఈ ఆట ఆడడం ద్వారా మేధాశక్తితో పాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి