Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:08 AM

కంచనపల్లిలో సేవా పథం ఐదవ రోజుకు చేరుకున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం

కంచనపల్లిలో సేవా పథం ఐదవ రోజుకు చేరుకున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం

కంచనపల్లిలో సేవా పథం ఐదవ రోజుకు చేరుకున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం
January 25, 2026 04:48 PM 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కంచనపల్లి గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), నల్గొండ ఎన్.ఎస్.ఎస్ యూనిట్–4 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శీతకాల ప్రత్యేక శిబిరం ఐదవ రోజుకు చేరుకుంది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న ఈ శిబిరంలో వాలంటీర్లు శ్రమదానం, సామాజిక అవగాహన కార్యక్రమాలతో తమ సేవా దృక్పథాన్ని చాటుతున్నారు.ఆదివారం శిబిరంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలోని వాటర్ ట్యాంక్ పరిసరాలలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడే ఈ కార్యక్రమం గ్రామస్తుల ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి మంద సావిత్రి, వాలంటీర్లు, గ్రామ యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలంటీర్ల సేవలను పరిశీలించిన గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి వారిని అభినందించి ప్రోత్సహించారు

మధ్యాహ్న భోజనం అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కు విలువపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను వివరించిన ప్రోగ్రాం అధికారి, పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని సూచించారు.

అనంతరం వాలంటీర్లు గ్రామ పాఠశాల ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి పరిసరాలను శుభ్రపరిచారు. సేవా భావనతో పాటు ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించే దిశగా శిబిరం సాగుతోందని గ్రామ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News