Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:58 AM

కంచనపల్లిలో జాతీయ సేవా పథకం శిబిరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

కంచనపల్లిలో జాతీయ సేవా పథకం శిబిరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

కంచనపల్లిలో జాతీయ సేవా పథకం శిబిరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
26-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కంచనపల్లి గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్గొండ జాతీయ సేవా పథకం నాలుగో విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శీతకాల శిబిరం సందర్భంగా సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి మంద సావిత్రి, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమాధికారి మంద సావిత్రి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దేశ నిర్మాణంలో యువత సేవాభావం కీలకమని, గ్రామ స్థాయి అభివృద్ధితోనే జాతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వెడుకల అనంతరం వాలంటీర్లు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సర్వే చేపట్టారు. ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించారు.శిబిరాన్ని సందర్శించిన సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి వాలంటీర్లతో మాట్లాడి వారి సేవలను అభినందించారు. జాతీయ సేవా పథకం శిబిరం ద్వారా గ్రామానికి మేలు జరుగుతోందని, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ప్రశంసనీయమని తెలిపారు.

Sthanikam

కంచనపల్లిలో జాతీయ సేవా పథకం శిబిరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

కంచనపల్లి గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్గొండ జాతీయ సేవా పథకం నాలుగో విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శీతకాల శిబిరం సందర్భంగా సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి మంద సావిత్రి, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమాధికారి మంద సావిత్రి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దేశ నిర్మాణంలో యువత సేవాభావం కీలకమని, గ్రామ స్థాయి అభివృద్ధితోనే జాతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వెడుకల అనంతరం వాలంటీర్లు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సర్వే చేపట్టారు. ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించారు.శిబిరాన్ని సందర్శించిన సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి వాలంటీర్లతో మాట్లాడి వారి సేవలను అభినందించారు. జాతీయ సేవా పథకం శిబిరం ద్వారా గ్రామానికి మేలు జరుగుతోందని, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ప్రశంసనీయమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News