Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:24 PM

కంచనపల్లిలో జాతీయ సేవా పథకం శిబిరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

కంచనపల్లిలో జాతీయ సేవా పథకం శిబిరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

కంచనపల్లిలో జాతీయ సేవా పథకం శిబిరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
January 26, 2026 05:03 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కంచనపల్లి గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్గొండ జాతీయ సేవా పథకం నాలుగో విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శీతకాల శిబిరం సందర్భంగా సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి మంద సావిత్రి, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమాధికారి మంద సావిత్రి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దేశ నిర్మాణంలో యువత సేవాభావం కీలకమని, గ్రామ స్థాయి అభివృద్ధితోనే జాతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వెడుకల అనంతరం వాలంటీర్లు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సర్వే చేపట్టారు. ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించారు.శిబిరాన్ని సందర్శించిన సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి వాలంటీర్లతో మాట్లాడి వారి సేవలను అభినందించారు. జాతీయ సేవా పథకం శిబిరం ద్వారా గ్రామానికి మేలు జరుగుతోందని, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ప్రశంసనీయమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News