కిషోర బాలికల నుంచి వృద్ధుల వరకు సంఘాల ఏర్పాటుకు పిలుపు
కిషోర బాలికల నుంచి వృద్ధుల వరకు సంఘాల ఏర్పాటుకు పిలుపు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం మండల సమాఖ్య అధ్యక్షురాలు, మండల సమాఖ్య ఏపీఎం అనంతయ్య సమక్షంలో ఐదు రౌండ్ల సీనియర్ సీఆర్పీల ద్వారా రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా చేయడం, సంఘాల బలోపేతంపై అవగాహన కల్పించడం జరిగింది. గ్రామాల్లో కిషోర బాలికల సంఘాలు, వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలను కొత్తగా ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. అలాగే మహిళల విద్య ప్రాముఖ్యత, బాలికల వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, స్వయం ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలు, భద్రతా చర్యలు మరియు సమాజంలో ధైర్యంగా ముందుకు సాగేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య సీసీలు,ఓబీలు,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి