PRINT TIME: May 26, 2026 08:56 PM
ఖేఢ్ లో గోల్కొండను ఏలిన మహాయోధుడికి ఘన నివాళులు
ఖేఢ్ లో గోల్కొండను ఏలిన మహాయోధుడికి ఘన నివాళులు
April 02, 2026 07:38 PM
53 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ భవన్లో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకుని, సుమారు 300 ఏళ్ల క్రితమే మొఘల్ పాలనలో గోల్కొండ ప్రాంతాన్ని ఏలిన గొప్ప యోధుడిగా ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో సమానత్వం, స్వాభిమానానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంజన్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నరసింహ గౌడ్, నారాయణఖేడ్ మండల నాయకులు రామా గౌడ్, రామచంద్ర గౌడ్, బీఎస్ పండరి, రాజకుమార్ పండరి తదితరులు పాల్గొనగా, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి