Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:27 AM

కెసిఆర్ హయాంలోనే నిజమైన అభివృద్ధి శివనేని గూడెంలో చిరుమర్తి లింగయ్య ప్రచారం

కెసిఆర్ హయాంలోనే నిజమైన అభివృద్ధి శివనేని గూడెంలో చిరుమర్తి లింగయ్య ప్రచారం

కెసిఆర్ హయాంలోనే నిజమైన అభివృద్ధి శివనేని గూడెంలో చిరుమర్తి లింగయ్య ప్రచారం
January 27, 2026 12:39 PM 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కోవిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శివనేనిగూడెంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు క్లుప్తంగా వివరించారు. అలాగే అబద్ధాలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసగించిందో, గత రెండేళ్లుగా అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజలకు బాకీ పడిన అంశాలను ప్రజలకు వివరించారు.

చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ…

కేసీఆర్ హయాంలో శివనేనిగూడెంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు రూ.2 కోట్లకు పైగా నిధులతో ఈ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను పూర్తి చేశామని చెప్పారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల ప్రభావంతో నేటికీ ప్రజల నోట కేసీఆర్ పేరు వినిపిస్తోందని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పథకాలు సకాలంలో అమలయ్యేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని ప్రజలే ముక్తకంఠంతో చెబుతున్నారని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు కేసీఆర్‌ను కోల్పోయామని బాధ పడుతున్నారని చెప్పారు.

స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గత రెండేళ్లుగా శివనేనిగూడెంలో తట్టెడు మట్టికూడా తీయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో పాత శిలాఫలకాలను మార్చి కొత్త శిలాఫలకాలు పెట్టి, కొత్త శంకుస్థాపనల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

ఈ రెండేళ్లలో మున్సిపాలిటీకి ఏం చేశారో చెప్పే ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలకు రావాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. డంపింగ్ యార్డు విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డంపింగ్ యార్డు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి తీర్మానం కూడా చేయలేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవ్వాలంటే కేసీఆర్ ఆశయాలతో ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News