Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:34 AM

కేంద్ర ప్రభుత్వ కార్మిక–కర్షక వ్యతిరేక విధానాలను నిరసించాలి

కేంద్ర ప్రభుత్వ కార్మిక–కర్షక వ్యతిరేక విధానాలను నిరసించాలి

కేంద్ర ప్రభుత్వ కార్మిక–కర్షక వ్యతిరేక విధానాలను నిరసించాలి
January 16, 2026 05:39 PM 140 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వ్య.కా.స, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త కార్మిక–కర్షక యాత్ర నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రానికి చేరుకున్న యాత్ర సందర్భంగా స్థానిక సుభాష్ కేంద్రంలో జరిగిన సభలో జిల్లా కార్యదర్శులు కొండమడుగు నర్సింహ్మ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం మాట్లాడారు.

లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు తదితర ప్రజా వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధానాలతో ప్రజలపై భారాన్ని మోపుతున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సభలో రైతు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News