Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:51 AM

కేంద్ర ప్రభుత్వ కార్మిక–కర్షక వ్యతిరేక విధానాలను నిరసించాలి

కేంద్ర ప్రభుత్వ కార్మిక–కర్షక వ్యతిరేక విధానాలను నిరసించాలి

కేంద్ర ప్రభుత్వ కార్మిక–కర్షక వ్యతిరేక విధానాలను నిరసించాలి
January 16, 2026 05:39 PM 127 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వ్య.కా.స, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త కార్మిక–కర్షక యాత్ర నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రానికి చేరుకున్న యాత్ర సందర్భంగా స్థానిక సుభాష్ కేంద్రంలో జరిగిన సభలో జిల్లా కార్యదర్శులు కొండమడుగు నర్సింహ్మ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం మాట్లాడారు.

లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు తదితర ప్రజా వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధానాలతో ప్రజలపై భారాన్ని మోపుతున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సభలో రైతు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News