స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వ్య.కా.స, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త కార్మిక–కర్షక యాత్ర నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రానికి చేరుకున్న యాత్ర సందర్భంగా స్థానిక సుభాష్ కేంద్రంలో జరిగిన సభలో జిల్లా కార్యదర్శులు కొండమడుగు నర్సింహ్మ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం మాట్లాడారు.
లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు తదితర ప్రజా వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధానాలతో ప్రజలపై భారాన్ని మోపుతున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సభలో రైతు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి