Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:10 AM

క్యాలెండర్ ఆవిష్కరణ వేదికగా ఉపాధ్యాయ సమస్యలపై PRTU TS గళం

క్యాలెండర్ ఆవిష్కరణ వేదికగా ఉపాధ్యాయ సమస్యలపై PRTU TS గళం

క్యాలెండర్ ఆవిష్కరణ వేదికగా ఉపాధ్యాయ సమస్యలపై PRTU TS గళం
January 08, 2026 04:08 AM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

PRTU TS రామన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రామన్నపేట మండల వనరుల కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి గవ్వజ్యోతి హాజరయ్యారు.

ప్రధాన అతిథిగా పాల్గొన్న PRTU TS యాదాద్రి భువనగిరి జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ భీమిడి ఉపేందర్ జీ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధి కోల్పోయిందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యూటీ, కమ్యూటేషన్ బకాయిలు, సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ చొక్కారపు విజయకుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులపై అనవసర ఒత్తిడిని తగ్గించాలని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.మండల శాఖ అధ్యక్షుడు కైరోజు లింగాచారి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని, ఉపాధ్యాయుల హెల్త్ కార్డులపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కరాచారి, శ్రీనివాసరావు, మండల బాధ్యులు అబ్దుల్ ఖయ్యాం, లింగస్వామి, మణి, సీనియర్ సభ్యులు వెంకటేశం, ఆనంద్, మహేష్, అజీజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News