క్రిష్ణవేణి పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
క్రిష్ణవేణి పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్లో వసంత పంచమి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సరస్వతి దేవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో పురోహితుల సమక్షంలో సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా గణపతి, గౌరీ పూజలు నిర్వహించిన అనంతరం పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు అక్షరాలు రాయడం ప్రారంభించడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి. యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్. మణితో పాటు ఉపాధ్యాయులు రషీద్, మురళి, మల్లేష్, శ్రీనివాస్, అలీం, ఉమారాణి, పూనం, వినోద, లావణ్య, మహాలక్ష్మి, ఫారియా, లక్ష్మీదేవి, శ్రావణి, మాధవి, విజయలక్ష్మి, కరుణ, మమత, శైలజ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి