క్రాస్ కంట్రీలో రామన్నపేట డిగ్రీ కళాశాల దూసుకుపోరు – యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానం
క్రాస్ కంట్రీలో రామన్నపేట డిగ్రీ కళాశాల దూసుకుపోరు – యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానం
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విశేష గౌరవం
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ కాలేజీ క్రాస్ కంట్రీ రేస్ పోటీల్లో రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ ప్రదర్శించి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కళాశాలకే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
ఈ పోటీల్లో కళాశాల తరఫున సునీల్, నీలవేణి, నవీన్, మోటే నవీన్, రాజు, పి. నవీన్, సాయి తేజలు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. వీరిలో సునీల్, నవీన్లు మహాత్మా గాంధీ యూనివర్సిటీ తరపున ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్ కంట్రీ రేస్ ఛాంపియన్షిప్కు ఎంపిక కావడం విశేషం.ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ విజేత విద్యార్థులకు మెమొంటోలు బహూకరించి అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా మెరుగైన ప్రతిభ కనబరిచి యూనివర్సిటీకి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రవీందర్ రావు విద్యార్థులను అభినందిస్తూ, యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం కళాశాల చరిత్రలో గర్వకారణమని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి