Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:02 PM

క్రాస్ కంట్రీ రేసులో హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తా

క్రాస్ కంట్రీ రేసులో హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తా

క్రాస్ కంట్రీ రేసులో హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తా
January 20, 2026 08:33 PM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అంతర్‌కళాశాల క్రాస్ కంట్రీ రేసులో అద్భుత ప్రతిభను చాటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో కళాశాల విద్యార్థులు టీమ్ ఛాంపియన్‌షిప్ స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారు.

ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన బాలుర జట్టు టీమ్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఎన్. ధోని (బి.ఏ. ద్వితీయ సంవత్సరం) జట్టు నాయకత్వం వహించగా, బి. అరవింద్ (బి.ఎస్సీ. ద్వితీయ సంవత్సరం), పవన్ (బి.కామ్ ప్రథమ సంవత్సరం), భాను (బి.కామ్ ప్రథమ సంవత్సరం) సభ్యులుగా పాల్గొన్నారు.

అదే విధంగా బాలికల జట్టు టీమ్ ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానాన్ని సాధించి కళాశాల ఖ్యాతిని పెంచింది. సౌమ్య (బి.కామ్ ప్రథమ సంవత్సరం), బిందు (బి.ఎస్సీ. ప్రథమ సంవత్సరం), సింధు (బి.ఎస్సీ. ప్రథమ సంవత్సరం), నందిని (బి.ఏ. ప్రథమ సంవత్సరం), తేజ శ్రీ (బి.కామ్ ద్వితీయ సంవత్సరం) జట్టు సభ్యులుగా రాణించారు.

విద్యార్థుల విజయాలపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు అభినందనలు తెలిపారు. వారి క్రమశిక్షణ, అంకితభావమే ఈ ఫలితాలకు కారణమని పేర్కొన్నారు. ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత మాట్లాడుతూ, ఎన్. ధోని జనవరి 24, 2026న జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరగనున్న 60వ ఓపెన్ నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనితతో పాటు అధ్యాపక బృందం విద్యార్థులను ఘనంగా అభినందించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News