Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:44 PM

కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి

కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి

కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి
January 12, 2026 07:08 AM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ బుధవారం భోగి రోజున రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి గ్రామ మహిళలతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, 14వ తేదీ బుధవారం సాయంత్రం ముగ్గుల పోటీలు జరుగుతాయని, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.5016, రెండో బహుమతిగా రూ.3016, మూడో బహుమతిగా రూ.2016 నగదు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంక్రాంతి పండుగ వాతావరణంలో మహిళల సృజనాత్మకతకు వేదికగా ఈ ముగ్గుల పోటీలు నిలవనున్నాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News