PRINT TIME: April 10, 2026 10:36 AM
కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి
కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి
January 12, 2026 07:08 AM
48 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ బుధవారం భోగి రోజున రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి గ్రామ మహిళలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 14వ తేదీ బుధవారం సాయంత్రం ముగ్గుల పోటీలు జరుగుతాయని, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.5016, రెండో బహుమతిగా రూ.3016, మూడో బహుమతిగా రూ.2016 నగదు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సంక్రాంతి పండుగ వాతావరణంలో మహిళల సృజనాత్మకతకు వేదికగా ఈ ముగ్గుల పోటీలు నిలవనున్నాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి