నార్కట్పల్లి పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాల సందర్భంగా అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సాగి శైలేంద్ర కుమార్ శర్మ మాట్లాడుతూ, “క్రమశిక్షణతో కూడిన చదువుతో మాత్రమే లక్ష్యాలను చేరుకోగలము అని మా విద్యార్థులు నిరూపించారు” అని అన్నారు.
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య బృందం కరస్పాండెంట్ ముద్ధం నరసింహ గౌడ్, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, కొప్పు నాగరాజుగౌడ్, ముద్రబోయిన మల్లేష్, కావటి సత్తయ్య, తరాల శ్రీశైలం, అలాగే అధ్యాపకులు బ్రహ్మచారి, గణేశ్, రాజు, కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి