కామినేని ఫ్లైఓవర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి రెండు లారీలు స్వాధీనం డ్రైవర్లు అదుపులోకి
కామినేని ఫ్లైఓవర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి రెండు లారీలు స్వాధీనం డ్రైవర్లు అదుపులోకి
Komidala Mahender reddy
నార్కట్పల్లి మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు.ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల సమయంలో నార్కట్పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తికి నమ్మదగిన సమాచారం అందడంతో, ఆయన సిబ్బందితో కలిసి నార్కట్పల్లి గ్రామ శివారులోని కామినేని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ వైపు అక్రమంగా, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను గుర్తించారు. వాటి నంబర్లు TG07T4554, TS07UH4554గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన రవాణా అనుమతులు లేకపోవడంతో రెండు లారీలను స్వాధీనం చేసుకుని, వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.తదుపరి చర్యల నిమిత్తం లారీలు మరియు డ్రైవర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి