Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:02 AM

కమ్యూనిస్టుల ఐక్యత దేశానికి అవసరం: కే. శ్రీనివాసరెడ్డి

కమ్యూనిస్టుల ఐక్యత దేశానికి అవసరం: కే. శ్రీనివాసరెడ్డి

కమ్యూనిస్టుల ఐక్యత దేశానికి అవసరం: కే. శ్రీనివాసరెడ్డి
January 07, 2026 07:11 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల పక్షాన నిలిచిన పార్టీలే కమ్యూనిస్టులు – సిపిఐ శతాబ్ది ఉత్సవాల సెమినార్‌లో వ్యాఖ్యలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీల ఐక్యత దేశానికి అత్యవసరమని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కే. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని లయన్స్‌క్లబ్‌లో సిపిఐ వందేళ్ల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన “కమ్యూనిస్టుల ఐక్యత – నేటి అవసరం” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కే. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కమ్యూనిస్టుల ఐక్యత అనివార్యమైందని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య శక్తిగా కమ్యూనిస్టులు నిలిచారని గుర్తు చేశారు. సిపిఐ చీలికతో ప్రజాస్వామ్య శక్తుల బలం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీ ఇతర పార్టీల మద్దతుపైనే ఆధారపడి కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీ పతనం సమీపంలో ఉందని వ్యాఖ్యానించారు.సిపిఐ వందేళ్ల చరిత్ర ప్రజా పోరాటాలకు ప్రతీకగా నిలిచిందని, స్వాతంత్ర్య ఉద్యమం నుంచి రైతు, కార్మిక ఉద్యమాల వరకూ కమ్యూనిస్టుల పాత్ర అపూర్వమని ఆయన కొనియాడారు. రాబోయే ఖమ్మం శతాబ్ది సభలో లక్షలాది మంది పాల్గొని ఫాసిస్టు పాలనకు చెక్‌ పెట్టాలని పిలుపునిచ్చారు.అనంతరం మాట్లాడిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు బీజేపీ “ఆపరేషన్‌ కగార్” పేరుతో కమ్యూనిస్టుల గొంతుకలను అణచివేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆలోచనల స్వేచ్ఛను కట్టడి చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలే దేశానికి ఆశాకిరణాలు చూపగలవని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బి. అజయ్‌ సారధి రెడ్డి, నల్లు సుధాకర్‌ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్‌, ప్రజాపక్షం జిల్లా స్టాపర్‌ కల్లూరి ప్రభాకర్‌, టీఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఉదయధీర్‌, 143 జిల్లా కన్వీనర్‌ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News