Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

కామ దహనం నేడు – రేపు హోలీ సంబరాలు

కామ దహనం నేడు – రేపు హోలీ సంబరాలు

కామ దహనం నేడు – రేపు హోలీ సంబరాలు
02-03-2026 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రశాంతంగా, సురక్షితంగా పండుగ జరుపుకోండి:

చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపు

హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సంప్రదాయాల నడుమ నిర్వహించుకోవాలని మొగుదాల పావని రమేష్ గౌడ్ సూచించారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఆమె విడుదల చేసిన ప్రకటనలో పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపాలిటీ పాలకవర్గం తరపున అందరికీ శుభాభినందనలు తెలియజేశారు.

పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత సురక్షితమైన సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని, రసాయన రంగులను దూరంగా ఉంచాలని సూచించారు. తెలియని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లవద్దని హెచ్చరించారు.హోలీ అనంతరం చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలకు వెళ్లే యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన మార్గదర్శనం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

కామ దహనం నేడు – రేపు హోలీ సంబరాలు

Article Image

ప్రశాంతంగా, సురక్షితంగా పండుగ జరుపుకోండి:

చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపు

హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సంప్రదాయాల నడుమ నిర్వహించుకోవాలని మొగుదాల పావని రమేష్ గౌడ్ సూచించారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఆమె విడుదల చేసిన ప్రకటనలో పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపాలిటీ పాలకవర్గం తరపున అందరికీ శుభాభినందనలు తెలియజేశారు.

పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత సురక్షితమైన సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని, రసాయన రంగులను దూరంగా ఉంచాలని సూచించారు. తెలియని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లవద్దని హెచ్చరించారు.హోలీ అనంతరం చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలకు వెళ్లే యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన మార్గదర్శనం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News