కాల యాపన కోసమే.. విద్యా వారోత్సవాలు; మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య
కాల యాపన కోసమే.. విద్యా వారోత్సవాలు; మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య
Bandi Kiran Kumar
గత ప్రభుత్వం ఇచ్చిన ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టినందుక.. విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీలు ఇవ్వనందుకా దేనికోసం వారోత్సవాలు జరుపుతున్నారని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... విద్యాభరోస కార్డు ఇస్తామని ఎగ్గొట్టినందుక.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు విషాహారం తిని చనిపోయినందుక విద్యా వారోత్సవాలు అని ఎద్దేవ చేశారు. వారోత్సవాల పేరుతో ప్రజాధనం లూటీ చేసి పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కి తగదని అన్నారు. వారోత్సవాల పేరుతో కాలయాపన చేయడం మాని ఎన్నికల మానిఫెస్టో లో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి. పాఠ్య పుస్తకాలను సకాలం లో అందించాలని డిమాండ్ చేస్తున్నాం. నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. విద్య కు బడ్జెట్ పెంచాలని. విదేశీ విద్యకోసం వెళ్ళే విద్యార్థులకు 20లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యావ్యవస్థ లో ఉన్న టీచర్లు. నాలుగవ తరగతి ఉద్యోగ ఖాళీలను వెంటనే నింపాలి. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజ్ దోపిడి నీ అరికట్టాలని కోరుతున్నాం.. డిగ్రీ..ఇంజనీరింగ్.. మొదలగు ఉన్నత విద్యా సంస్థ లన్నింటిని ప్రభుత్వ పరిధి లో కట్టుబడి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాకు నాయక్.l. లతీబ్.. నల్లబెల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి