కక్కిరేణి గ్రామంలో సంక్రాంతి సంబరాలు యువత ఉత్సాహానికి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్
కక్కిరేణి గ్రామంలో సంక్రాంతి సంబరాలు యువత ఉత్సాహానికి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
భోగి–సంక్రాంతి–కనుమ పండుగలను పురస్కరించుకుని రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో యువతకు ఉత్తేజం కలిగించేలా గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్కు గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ నడిగోటి పాండు నాయకత్వం వహించారు.గ్రామ యువత క్రీడల వైపు ఆకర్షితులై శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పిట్ట రాంరెడ్డి, కన్నెబోయిన జగన్, వేముల దయాకర్, నడిగోటి గణేష్, పిండి సైదులు పాల్గొనగా, ఆర్గనైజర్ మేనేజ్మెంట్ బాధ్యతలను గుండు సైదులు, గుండెపురి దేవేందర్, నడిగోటి సురేష్ సమర్థవంతంగా నిర్వహించారు. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి