Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:34 PM

కేసీఆర్ కోటలో కాంగ్రెస్ హవా

కేసీఆర్ కోటలో కాంగ్రెస్ హవా

కేసీఆర్ కోటలో కాంగ్రెస్ హవా
January 07, 2026 07:31 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ జయకేతనం – సర్పంచ్‌లకు ఘన సన్మానం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం చాటిందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం పార్టీ శ్రేణుల సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.బుధవారం మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్ధిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన మన్నె కళ్యాణ్, గజ్వెల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో కలిసి చిట్కుల్‌లోని ఎన్‌ఎంఆర్ కార్యాలయంలో నీలం మధు ముదిరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డ్ సభ్యులను నీలం మధు ముదిరాజ్ అభినందించి ఘనంగా సత్కరించారు. గజ్వెల్‌లో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహా పార్టీ శ్రేణుల కృషి మరువలేనిదని కొనియాడారు.గ్రామాల్లో ప్రజలు చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేసి సమగ్ర అభివృద్ధి దిశగా పనిచేయాలని సర్పంచ్‌లకు సూచించారు.ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ భాస్కర్ యాదవ్, జీడిపల్లి గ్రామ సర్పంచ్ నర్సన్నగారి కృష్ణ, కొండాపూర్ గ్రామ సర్పంచ్ నూకల రాము, వెంకటాపూర్ అగ్రహారం గ్రామ సర్పంచ్ వెంకటేష్, గౌతజిగూడా గ్రామ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ ఎర్ర నాగరాజు, ఇతర సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News