Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:58 AM

కాస్మోటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్

కాస్మోటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్

కాస్మోటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్
24-12-2025 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కష్టపడే కార్మికుల సంక్షేమమే లక్ష్యం

పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్

స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ పట్టణంలో పారిశుద్ధ్య పనులతో పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ఆత్మీయంగా చేయూత అందించారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్స్ సామాగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్మికులకు సబ్బులు, సర్ఫ్‌లు, బెల్లం తదితర నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ— పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే కార్మికుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీదేనని పేర్కొన్నారు.

పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సామాగ్రిని అందించడం ఆనవాయితీగా కొనసాగుతోందని శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కఠిన పరిస్థితుల్లో పని చేసే కార్మికులకు కాస్మోటిక్స్ వంటి అవసరమైన వస్తువులు తప్పనిసరిగా అందించాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ కష్టాన్ని గుర్తించి సహాయం చేసిన మున్సిపల్ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

కాస్మోటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్

Article Image

కష్టపడే కార్మికుల సంక్షేమమే లక్ష్యం

పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్

స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ పట్టణంలో పారిశుద్ధ్య పనులతో పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ఆత్మీయంగా చేయూత అందించారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్స్ సామాగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్మికులకు సబ్బులు, సర్ఫ్‌లు, బెల్లం తదితర నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ— పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే కార్మికుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీదేనని పేర్కొన్నారు.

పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సామాగ్రిని అందించడం ఆనవాయితీగా కొనసాగుతోందని శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కఠిన పరిస్థితుల్లో పని చేసే కార్మికులకు కాస్మోటిక్స్ వంటి అవసరమైన వస్తువులు తప్పనిసరిగా అందించాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ కష్టాన్ని గుర్తించి సహాయం చేసిన మున్సిపల్ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News