కాపురం కాపాడాలని కలెక్టర్ను ఆశ్రయించిన యువకుడు
కాపురం కాపాడాలని కలెక్టర్ను ఆశ్రయించిన యువకుడు
Editor Desk
భార్యను విడదీయొద్దు… గర్భాన్ని తొలగించొద్దు
ప్రేమ వివాహంపై ప్రతీకారం?
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
తన కుటుంబాన్ని విడదీయొద్దని, భార్య గర్భాన్ని తొలగించవద్దని, తన కాపురాన్ని నిలబెట్టి న్యాయం చేయాలని కోరుతూ ఓ యువకుడు జిల్లా అధికారులను ఆశ్రయించాడు. జనగాం జిల్లా కొడకండ్ల మండలం రామారం గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి సందీప్ గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావులకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు.సందీప్ తెలిపిన వివరాల ప్రకారం… యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన దివ్య పూజతో 2024 నుంచి ప్రేమలో ఉన్నారు. ఇరువర్గాల పెద్దలు ఈ ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో గత ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని ఆర్య సమాజంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మే నెలలో సందీప్ తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించి రామారం గ్రామంలోని ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు.పెళ్లి అనంతరం దంపతులు గత ఎనిమిది నెలలుగా హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. సందీప్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం దివ్య పూజ ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవల క్రిస్మస్ పండుగ సందర్భంగా భార్యను భువనగిరిలోని తన పెద్దమ్మ మేడి జయంతి ఇంటివద్ద వదిలివచ్చానని సందీప్ తెలిపారు.అయితే ప్రేమ వివాహం మొదటి నుంచే ఇష్టం లేని భార్య తరపు బంధువులు — తల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ — దివ్య పూజ మనసు మార్చి గర్భస్రావానికి ప్రయత్నాలు చేస్తున్నారని, తనపై విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారని సందీప్ ఆరోపించారు. ఇది తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని పేర్కొన్నారు.జిల్లా అధికారులు వెంటనే స్పందించి తన భార్య గర్భాన్ని కాపాడాలని, తన కాపురాన్ని నిలబెట్టాలని, భార్యను తనతో కలిసి జీవించేలా సహకరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి