Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:54 AM

కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.. ఉపాధిహామీ పేరు మార్పుకు నిరసన

కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.. ఉపాధిహామీ పేరు మార్పుకు నిరసన

కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.. ఉపాధిహామీ పేరు మార్పుకు నిరసన
28-12-2025 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచిలో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం:స్థానిక ప్రతినిధి జనార్ధన్:

భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూసుమంచి మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ హఫీజుద్దీన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూసుమంచి గ్రామ సర్పంచ్ కొండా కృష్ణవేణి, ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ, యువజన నాయకులు బెల్లంకొండ శరత్‌కుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, వార్డు సభ్యులు హాజరయ్యారు.

కార్యక్రమానికి ముందు ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు, వార్డు సభ్యులను మూడు రంగుల కండువాలతో సన్మానించి అభినందించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Sthanikam

కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.. ఉపాధిహామీ పేరు మార్పుకు నిరసన

Article Image

కూసుమంచిలో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం:స్థానిక ప్రతినిధి జనార్ధన్:

భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూసుమంచి మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ హఫీజుద్దీన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూసుమంచి గ్రామ సర్పంచ్ కొండా కృష్ణవేణి, ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ, యువజన నాయకులు బెల్లంకొండ శరత్‌కుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, వార్డు సభ్యులు హాజరయ్యారు.

కార్యక్రమానికి ముందు ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు, వార్డు సభ్యులను మూడు రంగుల కండువాలతో సన్మానించి అభినందించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News