Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:42 AM

జిల్లా ఎస్పీకి ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల వినతిపత్రం

జిల్లా ఎస్పీకి ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల వినతిపత్రం

జిల్లా ఎస్పీకి ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల వినతిపత్రం
January 11, 2026 08:30 AM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్–జడ్పిటిసి–ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో

పోలీస్ పికెట్ల ఏర్పాటు చేయాలి

భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు శాంతియుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు అన్ని ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల నాయకులు జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం భువనగిరిలో జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.రాచకొండ కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీ హోదా రావడం సందర్భంగా జిల్లా ఎస్పీని సంఘ నాయకులు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే పోలీస్ యంత్రాంగం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మున్సిపల్ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసేలా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్యాట్రోలింగ్ పెంచి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.కొన్ని ప్రాంతాల్లో కుల, రాజకీయ ఆధిపత్యాలు అధికంగా ఉన్నాయని, వాటిని నియంత్రించి ఆధిపత్య రాజకీయాలకు గట్టి అడ్డుకట్ట వేయాలని సూచించారు. నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, కిడ్నాప్ హెచ్చరికలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మందు, డబ్బు పంపిణీ వంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయాలని, సమాచారం అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలపై దాడులు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.ప్రజాసేవపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనలేకుండా ఎన్నికల్లో పాల్గొనే విధంగా పోలీస్ శాఖ భరోసా కల్పించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News