Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

జిల్లా ఎస్పీకి ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల వినతిపత్రం

జిల్లా ఎస్పీకి ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల వినతిపత్రం

జిల్లా ఎస్పీకి ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల వినతిపత్రం
11-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్–జడ్పిటిసి–ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో

పోలీస్ పికెట్ల ఏర్పాటు చేయాలి

భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు శాంతియుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు అన్ని ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల నాయకులు జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం భువనగిరిలో జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.రాచకొండ కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీ హోదా రావడం సందర్భంగా జిల్లా ఎస్పీని సంఘ నాయకులు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే పోలీస్ యంత్రాంగం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మున్సిపల్ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసేలా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్యాట్రోలింగ్ పెంచి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.కొన్ని ప్రాంతాల్లో కుల, రాజకీయ ఆధిపత్యాలు అధికంగా ఉన్నాయని, వాటిని నియంత్రించి ఆధిపత్య రాజకీయాలకు గట్టి అడ్డుకట్ట వేయాలని సూచించారు. నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, కిడ్నాప్ హెచ్చరికలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మందు, డబ్బు పంపిణీ వంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయాలని, సమాచారం అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలపై దాడులు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.ప్రజాసేవపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనలేకుండా ఎన్నికల్లో పాల్గొనే విధంగా పోలీస్ శాఖ భరోసా కల్పించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా ఎస్పీకి ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల వినతిపత్రం

Article Image

మున్సిపల్–జడ్పిటిసి–ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో

పోలీస్ పికెట్ల ఏర్పాటు చేయాలి

భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు శాంతియుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు అన్ని ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని ఎస్సీ–ఎస్టీ–బీసీ సంఘాల నాయకులు జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం భువనగిరిలో జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.రాచకొండ కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీ హోదా రావడం సందర్భంగా జిల్లా ఎస్పీని సంఘ నాయకులు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే పోలీస్ యంత్రాంగం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మున్సిపల్ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసేలా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్యాట్రోలింగ్ పెంచి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.కొన్ని ప్రాంతాల్లో కుల, రాజకీయ ఆధిపత్యాలు అధికంగా ఉన్నాయని, వాటిని నియంత్రించి ఆధిపత్య రాజకీయాలకు గట్టి అడ్డుకట్ట వేయాలని సూచించారు. నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, కిడ్నాప్ హెచ్చరికలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మందు, డబ్బు పంపిణీ వంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయాలని, సమాచారం అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలపై దాడులు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.ప్రజాసేవపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనలేకుండా ఎన్నికల్లో పాల్గొనే విధంగా పోలీస్ శాఖ భరోసా కల్పించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News