Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:09 AM

జీవో నం.7పై ఆగ్రహం: పేద విద్యార్థుల పాలిట డెత్ వారెంట్ అంటున్న బీఆర్‌ఎస్‌వీ నేతలు

జీవో నం.7పై ఆగ్రహం: పేద విద్యార్థుల పాలిట డెత్ వారెంట్ అంటున్న బీఆర్‌ఎస్‌వీ నేతలు

జీవో నం.7పై ఆగ్రహం: పేద విద్యార్థుల పాలిట డెత్ వారెంట్ అంటున్న బీఆర్‌ఎస్‌వీ నేతలు
May 03, 2026 08:28 AM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గంలో జీవో నంబర్ 7పై విద్యార్థి సంఘాల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. బీఆర్‌ఎస్‌వీ మాజీ నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 పేద విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని తీవ్రంగా విమర్శించారు.

ఆయన మాటల్లో, “ముందు ఫీజు కట్టండి – తర్వాత ప్రభుత్వం చెల్లిస్తుంది అంటున్నారు. తిండికే ఇబ్బంది పడే పేద విద్యార్థులు వేల రూపాయలు ముందుగానే ఎలా సమకూర్చుకుంటారు?” అని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని క్రమంగా ఎత్తివేయడానికి ఇదొక కుట్రగా కనిపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే ఫీజులు చెల్లించలేక సుమారు 14 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే నిలిచిపోయాయని తెలిపారు.

ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం సరైంది కాదని, విద్యార్థుల ఆశలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 7ను తక్షణమే రద్దు చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

విద్యార్థి సంఘాలు హెచ్చరిక:

జీవోను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News