Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:45 AM

జీతాలు లేక పనికి రాని సిబ్బంది… స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించిన సర్పంచ్

జీతాలు లేక పనికి రాని సిబ్బంది… స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించిన సర్పంచ్

జీతాలు లేక పనికి రాని సిబ్బంది… స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించిన సర్పంచ్
17-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం, బోయగుబ్బ

గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసేందుకు బోయగుబ్బ గ్రామ సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ స్వయంగా ముందుకు వచ్చి ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించారు. గత ఐదు నెలలుగా గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులకు హాజరు కావడం లేదు.

గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌కు కూడా జీతం అందకపోవడంతో ఆయన కూడా పనికి రావడం మానేశారు. దీంతో గ్రామంలో చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితిని గమనించిన సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడిపి గ్రామంలోని వీధి వీధికి వెళ్లి చెత్తను సేకరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకున్న ఈ చర్యను గ్రామస్థులు అభినందించారు.

గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడటానికి సర్పంచ్ స్వయంగా ముందుకురావడంఆదర్శప్రాయమని స్థానికులు పేర్కొన్నారు. అలాగే పంచాయతీ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు త్వరగా చెల్లించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Sthanikam

జీతాలు లేక పనికి రాని సిబ్బంది… స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించిన సర్పంచ్

Article Image

చిట్యాల మండలం, బోయగుబ్బ

గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసేందుకు బోయగుబ్బ గ్రామ సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ స్వయంగా ముందుకు వచ్చి ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించారు. గత ఐదు నెలలుగా గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులకు హాజరు కావడం లేదు.

గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌కు కూడా జీతం అందకపోవడంతో ఆయన కూడా పనికి రావడం మానేశారు. దీంతో గ్రామంలో చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితిని గమనించిన సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడిపి గ్రామంలోని వీధి వీధికి వెళ్లి చెత్తను సేకరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకున్న ఈ చర్యను గ్రామస్థులు అభినందించారు.

గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడటానికి సర్పంచ్ స్వయంగా ముందుకురావడంఆదర్శప్రాయమని స్థానికులు పేర్కొన్నారు. అలాగే పంచాయతీ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు త్వరగా చెల్లించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News