యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా యాదాద్రి జిల్లా పరిధిలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.వారాంతం, పండుగ వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి వరంగల్ దిశగా పట్నం వాసులు పెద్ద సంఖ్యలో ప్రయాణించడంతో రహదారి రద్దీగా మారింది. టోల్ ప్లాజా వద్ద వాహనాల వరుసలు ఏర్పడటంతో ప్రయాణికులు కొంతసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి