PRINT TIME: April 10, 2026 01:20 PM
జాతీయ పతాకానికి అవమానం… అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు
జాతీయ పతాకానికి అవమానం… అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు
January 27, 2026 10:18 AM
303 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నిర్లక్ష్యానికి నిలువుటద్దం
రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి:
జాతీయ పతాకం విషయంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ కార్యాలయం ఎదుట జాతీయ జెండా మధ్యలోనే జారి నిలిచిన ఘటన కలకలం రేపింది.గణతంత్ర వేడుకల సందర్భంగా జెండా ఎగురవేసిన అధికారులు పతాకాన్ని పట్టిష్టంగా కట్టడంలో విఫలమవడంతో, మధ్యాహ్నం సమయానికి జెండా కర్ర మధ్యభాగానికి జారింది. జాతీయ గౌరవ చిహ్నమైన త్రివర్ణ పతాకం ఈ విధంగా అవమానానికి గురవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయం ఎదుటే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధ్యత వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే ఇలా నిర్లక్ష్యం చూపడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి