Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:39 AM

జాతీయ పతాకానికి అవమానం… అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు

జాతీయ పతాకానికి అవమానం… అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు

జాతీయ పతాకానికి అవమానం… అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు
January 27, 2026 10:18 AM 308 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్లక్ష్యానికి నిలువుటద్దం

రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి:

జాతీయ పతాకం విషయంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్ కార్యాలయం ఎదుట జాతీయ జెండా మధ్యలోనే జారి నిలిచిన ఘటన కలకలం రేపింది.గణతంత్ర వేడుకల సందర్భంగా జెండా ఎగురవేసిన అధికారులు పతాకాన్ని పట్టిష్టంగా కట్టడంలో విఫలమవడంతో, మధ్యాహ్నం సమయానికి జెండా కర్ర మధ్యభాగానికి జారింది. జాతీయ గౌరవ చిహ్నమైన త్రివర్ణ పతాకం ఈ విధంగా అవమానానికి గురవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రభుత్వ కార్యాలయం ఎదుటే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధ్యత వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే ఇలా నిర్లక్ష్యం చూపడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News