Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:49 AM

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం అర్హులకూ అక్రిడేషన్ లేదు: షానూర్

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం అర్హులకూ అక్రిడేషన్ లేదు: షానూర్

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం అర్హులకూ అక్రిడేషన్ లేదు: షానూర్
January 24, 2026 02:23 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోత్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు.

పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు న్యాయం దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే కొనసాగుతున్నాయని, ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు.అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు చెల్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.

జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి. కాజా పసియుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేశ్, మోత్కూరు మండల అధ్యక్షులు సోమన్న చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News