జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం అర్హులకూ అక్రిడేషన్ లేదు: షానూర్
జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం అర్హులకూ అక్రిడేషన్ లేదు: షానూర్
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోత్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు.
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు న్యాయం దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే కొనసాగుతున్నాయని, ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు.అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు చెల్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.
జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి. కాజా పసియుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేశ్, మోత్కూరు మండల అధ్యక్షులు సోమన్న చారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి