Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:48 AM

జనవరి 24న ‘చలో కోదాడ’ను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ నేతల పిలుపు

జనవరి 24న ‘చలో కోదాడ’ను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ నేతల పిలుపు

జనవరి 24న ‘చలో కోదాడ’ను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ నేతల పిలుపు
January 20, 2026 05:45 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కోదాడ/నల్లగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

కర్ల రాజేష్ మృతి పోలీసు దౌర్జన్యానికి ప్రత్యక్ష నిదర్శనమని ఆరోపిస్తూ, ఈ ఘటనకు బాధ్యులైన చిలుకూరు ఎస్సైతో పాటు సంబంధిత పోలీసు అధికారులపై తక్షణమే క్రిమినల్ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసు కస్టడీ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడాలని, కాంగ్రెస్ పాలనలో పోలీస్ రాజ్యం కొనసాగుతోందని తీవ్రంగా విమర్శించారు.ఈ మేరకు జనవరి 24న నిర్వహించనున్న “చలో కోదాడ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు కస్టడీలో కర్ల రాజేష్ అనుమానాస్పద మృతి ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచిన ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం మౌనం పాటించడం, బాధ్యులైన అధికారులను రక్షించే ప్రయత్నాలు చేయడం అత్యంత ఖండనీయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ, నిరపరాధులపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు.బాధ్యుల్ని కాపాడే ప్రయత్నాల్లో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ పాత్ర ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని విమర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజల ఐక్య పోరాటమే పరిష్కారమని నేతలు స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం “చలో కోదాడ” కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రజాసంఘాలు, యువజనులు, మహిళలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల నాయకులు ముత్తవరపు రమేష్, పొట్టా విజయ కిరణ్, గుడిపూడి శ్రీకాంత్, బట్టు కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ నభీ, యరమాల శ్రీను, పోట్ల సతీష్, నల్లపాటి శ్రీనివాసరావు, పర్స హరి, పోతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News