Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:20 PM

జనవరి 24 బంద్‌లో పాల్గొంటాం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

జనవరి 24 బంద్‌లో పాల్గొంటాం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

జనవరి 24 బంద్‌లో పాల్గొంటాం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
January 22, 2026 08:33 PM 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని జిల్లా ఉద్యమానికి పత్తికొండలో మద్దతు

పత్తికొండ, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 24న నిర్వహించనున్న అయిదు నియోజకవర్గాల బంద్‌కు పూర్తి మద్దతు ఇస్తామని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రకటించారు. బంద్‌లో తాము కూడా పాల్గొంటామని వెల్లడించటం ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చిందని జేఏసి నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జేఏసి నాయకులు నూర్ తదితరులు పత్తికొండలో శ్రీదేవి నివాసానికి వెళ్లి బంద్‌కు మద్దతు కోరగా, ఆమె సానుకూలంగా స్పందించారు. ఆదోని జిల్లా సాధన కోసం గత 70 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని శ్రీదేవి వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదోని జిల్లాను ఏర్పాటు చేసి, అయిదు నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు నూర్, అయ్యాళప్ప, షకీల్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News