జనవరి 24 బంద్లో పాల్గొంటాం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
జనవరి 24 బంద్లో పాల్గొంటాం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
స్థానికం బృందం
ఆదోని జిల్లా ఉద్యమానికి పత్తికొండలో మద్దతు
పత్తికొండ, స్థానికం ప్రధాన ప్రతినిధి
ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 24న నిర్వహించనున్న అయిదు నియోజకవర్గాల బంద్కు పూర్తి మద్దతు ఇస్తామని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రకటించారు. బంద్లో తాము కూడా పాల్గొంటామని వెల్లడించటం ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చిందని జేఏసి నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జేఏసి నాయకులు నూర్ తదితరులు పత్తికొండలో శ్రీదేవి నివాసానికి వెళ్లి బంద్కు మద్దతు కోరగా, ఆమె సానుకూలంగా స్పందించారు. ఆదోని జిల్లా సాధన కోసం గత 70 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని శ్రీదేవి వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదోని జిల్లాను ఏర్పాటు చేసి, అయిదు నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు నూర్, అయ్యాళప్ప, షకీల్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి