జహీరాబాద్: పట్టణంలోని సెంట్రల్ చర్చ్ MRHS గ్రౌండ్స్ వద్ద CYAZ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం నిర్వహించారు. యేసు క్రీస్తు పునరుత్థానం సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. సమాజంలో ప్రేమ, శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా త్రాగునీరు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రశాంత్ పాస్టర్ (పులిలోంక), నాగేష్ సర్పంచ్ (టేకూర్), చనేగపల్లి సర్పంచ్ సుధాకర్ కాంగ్రెస్ తరపున పాల్గొన్నారు. పాస్టర్లు, ఆల్ చర్చ్ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి