జహీరాబాద్ ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
జహీరాబాద్ ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
Krishna
జహీరాబాద్ పార్లమెంట్ పరిధి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, రోడ్ల నిర్మాణం, విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరగా, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి