ఇంటింటి ప్రచారంతో కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్ దూసుకుపోతున్నారు
ఇంటింటి ప్రచారంతో కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్ దూసుకుపోతున్నారు
Biksham
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నలభై ఏడు వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుమ్మరి కుంట్ల వేణుగోపాల్ గురువారం విస్తృతంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపను తట్టుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వార్డులో మౌలిక సదుపాయాల లోపాలు, తాగునీటి సమస్య, పారిశుధ్య లోపాలు, రోడ్లు, వీధిదీపాల అంశాలపై స్థానికులు తమ ఆవేదనను అభ్యర్థికి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రజల అవసరాలే తన ప్రాధాన్యత అని వేణుగోపాల్ హామీ ఇచ్చారు.ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే కౌన్సిలర్ గా పని చేస్తానని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. ఇంటింటి ప్రచారానికి వార్డులో మంచి స్పందన లభించిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆశాభావంతో ఉన్నారని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి