ఇంటి నుంచే ఇరవై లక్షల పుస్తకాల ప్రపంచం
ఇంటి నుంచే ఇరవై లక్షల పుస్తకాల ప్రపంచం
Editor Desk
ఇరవై లక్షల పుస్తకాల మధ్య ఒక మనిషి…
అంకె గౌడ
జ్ఞానానికి తన జీవితాన్ని అర్పించిన రైతు కొడుకు
పుస్తకాలు కొనలేని బాల్యం…
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
కానీ పుస్తకాలను వదలలేని మనసు…
ఒక గురువు చెప్పిన మాట – “ఒక మంచి పని చేయి”
ఆ మాటే అంకె గౌడ జీవితానికి దిక్సూచి అయింది.
కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా పాండవపురం సమీపంలోని హరాలహల్లి గ్రామంలో,
ఈ రోజు రెండు మిలియన్లకు పైగా పుస్తకాలతో
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గ్రంథాలయంగా పేరుగాంచిన
“అంకె గౌడ జ్ఞాన ప్రతిష్టానం & బుక్ హౌస్”
ఒక కల ఫలితంగా కాదు…
ఒక మనిషి జీవిత త్యాగానికి సాక్ష్యంగా నిలిచింది.
పుస్తకాలు లేని ఇంట్లో పుట్టిన పుస్తక ప్రేమికుడు
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన అంకె గౌడకు
చిన్ననాటి నుంచే చదవాలనే తపన.
కానీ పాఠశాల రోజుల్లో పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు.
గ్రామంలో మొత్తం 50–100 పుస్తకాలు ఉండేవి.
అవి చదివేశాక…
మళ్లీ చదవడమే అతని అలవాటు.
డబ్బులు లేకపోయినా,
ఆసక్తి మాత్రం తగ్గలేదు.
మిత్రుల సహాయంతో చదువు పూర్తయ్యింది.
అలాగే తనలాగే పుస్తకాలు కొనలేని పిల్లలు ఈ సమాజంలో ఎందరో ఉన్నారనే ఆలోచన
అతని మనసులో బలంగా నాటుకుపోయింది.
పుస్తకాల కోసం త్యాగం… త్యాగం కోసం జీవితం
బాల్యంలో మొదలైన పుస్తకాల సేకరణ
22 ఏళ్ల వయసులో ఒక నిర్ణయంగా మారింది.
“నా జీవితం పుస్తకాలకే” అని.
బస్ కండక్టర్గా పని…
షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగం…
ఎల్ఐసీ ఏజెంట్గా సంపాదన…
ఏ ఉద్యోగమైనా సరే,
వచ్చిన డబ్బులో 80 శాతం పుస్తకాలకే ఖర్చు.
డబ్బులు లేనప్పుడు
ఆవును కట్టి పాల దుకాణంలో పాలు పితికి వచ్చిన డబ్బుతో పుస్తకాలు.
ఇంటి సౌకర్యాలు తగ్గించుకుని,
జీవితాన్ని సరళీకృతం చేసుకుని
పుస్తకాల సంఖ్యను పెంచుకున్నాడు.
ఇంటి నుంచి జ్ఞాన దేవాలయంగా
ఒక గది…
తర్వాత మరో గది…
చివరకు సగం ఇల్లు పుస్తకాలతో నిండిపోయింది.
మైసూరులో ఉన్న విలువైన స్థలాన్ని అమ్మేసి
పుస్తకాలు కొనుగోలు చేశాడు.
ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన
30 లక్షల రూపాయల మొత్తాన్ని కూడా
పుస్తకాలకే అంకితం చేశాడు.
చివరకు 22 గుంటల స్థలంలో
దాతల సహకారంతో
జ్ఞాన ప్రతిష్టానం రూపుదిద్దుకుంది.
ఒకే పైకప్పు కింద ప్రపంచ సాహిత్యం
ఈ గ్రంథాలయంలో—
ఇంగ్లీష్ పుస్తకాలు 5 లక్షలకు పైగా
కన్నడ సాహిత్యం 2.5 లక్షలు
తెలుగు, తమిళం, మరాఠి, ఉర్దూ సహా భారతీయ భాషలు 4 లక్షలు
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు
రామాయణం, మహాభారతం, భగవద్గీతపై వేలాది రచనలు
నోబెల్, జ్ఞానపీఠ గ్రహీతల సంపూర్ణ రచనలు
1850 నుంచి 1950 వరకు అరుదైన పాత ముద్రణలు
ఇవి కేవలం సంఖ్యలు కాదు…
ఇవి ఒక మనిషి జీవితపు అడుగుజాడలు.
పుస్తకాలే కాదు… స్మృతుల భాండాగారం
అంకె గౌడకు పాత వస్తువులు చెత్త కాదు.
అవి గత కాలానికి చెందిన జ్ఞాపకాలు.
పాత నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపులు,
సినిమా పోస్టర్లు, టైప్ రైటర్లు, పాత టెలిఫోన్లు…
ఈ గ్రంథాలయం
పుస్తకాల ఇల్లు మాత్రమే కాదు…
ఒక జీవంత మ్యూజియం.
పూజారి లాంటి గ్రంథాలయ నిర్వాహకుడు
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
గ్రంథాలయం తెరిచి ఉంటుంది.
అయితే అంకె గౌడ మాత్రం
రోజుకు 15 గంటలకుపైగా
ఇక్కడే గడుపుతాడు.
పుస్తకాల అమరిక, సంరక్షణ,
పాఠకులతో సంభాషణ…
ఒక దేవాలయంలో పూజారి ఎలా ఉంటాడో,
ఈ గ్రంథాలయంలో అంకె గౌడ అలా ఉంటాడు.
గౌరవాలు… కానీ అహంకారం లేదు
ప్రపంచ రికార్డులు…
కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు…
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్…
జిపి రాజరత్న అవార్డు…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశంసలు…
దేశ విదేశాల సందర్శకుల అభినందనలు…
అన్నీ వచ్చినా
అంకె గౌడ మాత్రం అదే సరళ జీవితం.
జ్ఞానానికి అంకితమైన జీవితం
ఈ రోజూ రోజుకు 200 మందికి పైగా పాఠకులు
ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నారు.
సభ్యత్వ ఫీజు లేదు…
ప్రవేశ రుసుం లేదు…
జ్ఞానం అందరికీ చెందాలన్నదే
అంకె గౌడ జీవిత సందేశం.
అంకె గౌడ…
పుస్తకాలు సేకరించిన వ్యక్తి కాదు…
తరతరాలకు జ్ఞానాన్ని అప్పగించిన యజ్ఞపురుషుడు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి