ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ ప్రభంజనం – రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు
ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ ప్రభంజనం – రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు
Editor Desk
నల్లగొండ,
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండలోని ఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో అత్యున్నత మార్కులు సాధించి టాప్ ర్యాంకులు దక్కించుకున్నారు.
ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో జీలకుంట్ల నమిక, ఆకవరం శివాని విద్యార్థినులు 470కి 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. కొలగట్ల నవనీత (466), శీలం నిశాంత్, శ్రీ చరణ్, కొప్పు కృత్య, జోగు మధు కిషోర్ (465) మార్కులతో ప్రతిభ చూపారు.
బైపీసీ ఫస్ట్ ఇయర్లో పసుపులేటి కీర్తన 440కి 437 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, కన్నెకంటి శ్రీనిధి (436), వేముల వికాస్ (434), మేక సౌమ్య (432) ఉత్తమ ఫలితాలు సాధించారు.
సెకండ్ ఇయర్లో
బైపీసీ: నర్సింగ్ సాయి కిరణ్ 1000కి 995 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంక్ పొందాడు. అలకుంట్ల అనూష (994) మెరిసింది.
ఎంపీసీ: ఎర్రమాద జ్ఞానేశ్వర్ 992 మార్కులతో ర్యాంక్ సాధించగా, వీరమళ్ల రమ్య (991), కాసర్ల శ్వేత (990), గంధమల్ల విష్ణు వర్ధన్ (988), పువటి సాయి ప్రతాప్ (987) ప్రతిభ కనబర్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, అకాడమిక్ డీన్ భరత్ రెడ్డి, జోనల్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ మనోజ్ రెడ్డి మరియు అధ్యాపక బృందం అభినందించారు.
“క్రమశిక్షణ, పట్టుదలతో చదివితేనే విజయాలు సాధ్యమని ఎస్ఆర్ విద్యార్థులు మరోసారి నిరూపించారు” అని యాజమాన్యం పేర్కొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి