Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:07 AM

ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి

ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి

ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి
January 17, 2026 08:16 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:పటాన్‌చెరు నియోజకవర్గంలో మున్సిపల్ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో మున్సిపల్ రాజకీయాలు చురుగ్గా మారుతున్నాయి.ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రజాసేవ లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రోత్సాహంతో పాటు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో ఆమె ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు.స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వ లక్షణాలు గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డికి ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇస్నాపూర్ అభివృద్ధే లక్ష్యంగా,మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం,తాగునీరు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేస్తున్నారు. ప్రజలతో నిత్యం మమేకమై పనిచేసే నాయకురాలిగా తనను తాను నిరూపించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టు ఆమె సమీప వర్గాలు తెలిపాయి.ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి రావడంతో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News