Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:55 PM

ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి

ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి

ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి
January 17, 2026 08:16 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:పటాన్‌చెరు నియోజకవర్గంలో మున్సిపల్ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో మున్సిపల్ రాజకీయాలు చురుగ్గా మారుతున్నాయి.ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రజాసేవ లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రోత్సాహంతో పాటు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో ఆమె ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు.స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వ లక్షణాలు గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డికి ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇస్నాపూర్ అభివృద్ధే లక్ష్యంగా,మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం,తాగునీరు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేస్తున్నారు. ప్రజలతో నిత్యం మమేకమై పనిచేసే నాయకురాలిగా తనను తాను నిరూపించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టు ఆమె సమీప వర్గాలు తెలిపాయి.ఇస్నాపూర్ 16వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి బరిలోకి రావడంతో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News