ఇరవై ఆరు ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే బడి ప్రాంగణం. మధుర స్మృతులతో పూర్వ విద్యార్థుల పునర్మిళకం
ఇరవై ఆరు ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే బడి ప్రాంగణం. మధుర స్మృతులతో పూర్వ విద్యార్థుల పునర్మిళకం
స్థానికం బృందం
అక్కినపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో మధుర స్మృతుల పునర్మిళకం
చిన్ననాటి జ్ఞాపకాలకు మళ్లీ ఊపిరి
పాఠశాల గడప దాటినా, అనుబంధం చెదరలేదు
స్థానికం ప్రధాన ప్రతినిధి
నార్కట్పల్లి మండలం అక్కినపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1999–2000 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు.పాఠశాల ప్రాంగణం ఒకరోజు పాటు గతాన్ని గుర్తు చేసే జ్ఞాపకాలతో నిండిపోయింది. చదువు రోజుల్లోని సంఘటనలు, ఉపాధ్యాయుల శిక్షణ, సహపాఠులతో గడిపిన క్షణాలు ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేశాయి. నవ్వులు, ఆనందం, అనుబంధం ఈ సమ్మేళనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, అనంతరావ్ పాల్గొని పూర్వ విద్యార్థులను ఆశీర్వదించారు. విద్యార్థుల జీవితాల్లో పాఠశాల దశ ఎంత ముఖ్యమో గుర్తు చేస్తూ, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు.పూర్వ విద్యార్థుల సమ్మేళనం తరచుగా నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్న సంకల్పాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు వ్యక్తం చేశారు. అనుబంధాన్ని పునరుద్ధరించిన ఈ సమ్మేళనం అందరిలో చిరస్మరణీయంగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి