Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

ఇంపాక్ట్ రీజియన్–17 ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

ఇంపాక్ట్ రీజియన్–17 ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

ఇంపాక్ట్ రీజియన్–17 ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
January 13, 2026 05:48 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్–17, నారాయణఖేడ్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ రీజియన్–17కు చెందిన సభ్యులందరూ ఉత్సాహంగా, చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వామి వివేకానంద భారత దేశ ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పిన మహానుభావుడని, ఆయన ఆలోచనలు, బోధనలు నేటి యువతకు ఎంతో అవసరమని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో యువత సరైన దిశలో ఆలోచిస్తూ, నైపుణ్యపూర్వకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాంటి సమయంలో స్వామి వివేకానంద బోధనలు ప్రతి ఒక్కరి జీవితానికి ప్రేరణగా, మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించడం వంటి విలువలను ఆయన బోధనలు యువతలో నాటుతాయని వివరించారు.యువత దేశ భవిష్యత్తు అని, వారిని ఉత్తమ మార్గంలో నడిపించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. జాతీయ యువజన దినోత్సవాన్ని ఈ విధంగా ఘనంగా నిర్వహించడం ద్వారా యువతలో స్పూర్తి పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో రీజినల్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, నారీ సెల్ డైరెక్టర్ శ్వేత, సర్వీస్ డైరెక్టర్ జ్యోతిర్లింగం, బిజినెస్ డైరెక్టర్ సుశాంత్, ఇంపాక్ట్ ట్రైనర్ సాయి బాబా, సారికతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News