Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:32 AM

ఇంపాక్ట్ రీజియన్–17 ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

ఇంపాక్ట్ రీజియన్–17 ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

ఇంపాక్ట్ రీజియన్–17 ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
January 13, 2026 05:48 AM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్–17, నారాయణఖేడ్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ రీజియన్–17కు చెందిన సభ్యులందరూ ఉత్సాహంగా, చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వామి వివేకానంద భారత దేశ ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పిన మహానుభావుడని, ఆయన ఆలోచనలు, బోధనలు నేటి యువతకు ఎంతో అవసరమని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో యువత సరైన దిశలో ఆలోచిస్తూ, నైపుణ్యపూర్వకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాంటి సమయంలో స్వామి వివేకానంద బోధనలు ప్రతి ఒక్కరి జీవితానికి ప్రేరణగా, మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించడం వంటి విలువలను ఆయన బోధనలు యువతలో నాటుతాయని వివరించారు.యువత దేశ భవిష్యత్తు అని, వారిని ఉత్తమ మార్గంలో నడిపించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. జాతీయ యువజన దినోత్సవాన్ని ఈ విధంగా ఘనంగా నిర్వహించడం ద్వారా యువతలో స్పూర్తి పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో రీజినల్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, నారీ సెల్ డైరెక్టర్ శ్వేత, సర్వీస్ డైరెక్టర్ జ్యోతిర్లింగం, బిజినెస్ డైరెక్టర్ సుశాంత్, ఇంపాక్ట్ ట్రైనర్ సాయి బాబా, సారికతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News