Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటర్ ఫలితాల్లో ఎస్‌ఆర్ ప్రభంజనం – రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 09:40 PM

ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల అఖండ విజయం..

ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల అఖండ విజయం..

ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల అఖండ విజయం..
April 12, 2026 08:09 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో ప్రభంజనం..

నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండలోని ఎస్ఆర్ పీజేసీ బ్రాంచ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి స్టేట్ ర్యాంకులతో సత్తా చాటారు. అటు ప్రథమ సంవత్సరం, ఇటు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విద్యాసంస్థల కీర్తిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో జీలకుంట్ల నమిక, ఆకవరం శివానిలు 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. అదే విభాగంలో కొలగట్ల నవనీత 466 మార్కులు సాధించగా, శీలం నిశాంత్, శ్రీ చరణ్, కొప్పు కృత్య, జోగు మధు కిషోర్ లు తలో 465 మార్కులతో మెరిసి తమ విద్వత్తును చాటారు.

అటు బైపీసీ ప్రథమ సంవత్సరంలో పసుపులేటి కిర్తన 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. కన్నెకంటి శ్రీనిధి 436 మార్కులతో, వేముల వికాస్ 434 మార్కులతో, మేక సౌమ్య 432 మార్కులతో తమ ప్రతిభను చాటుకున్నారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ ఎస్ఆర్ విద్యార్థుల జోరు కొనసాగింది. బైపీసీ విభాగంలో నర్సింగ్ సాయి కిరణ్ 1000 మార్కులకు గాను 995 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలకుంట్ల అనూష 994 మార్కులతో అద్భుతమైన స్కోరు సాధించారు. ఎంపీసీ విభాగంలో ఎర్ర మాద జ్ఞానేశ్వర్ 992 మార్కులతో సత్తా చాటగా, వీరమళ్ళ రమ్య 991 మార్కులతో, కాసర్ల శ్వేత 990 మార్కులతో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. గంధమల్ల విష్ణు వర్ధన్ 988 మార్కులు, పువటి సాయి ప్రతాప్ 987 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిలో నిలిచారు. రాష్ట్రస్థాయిలో ఘనవిజయం సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఏనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కఠోర శ్రమకు తోడు అధ్యాపక బృందం అందించిన మెరుగైన శిక్షణ యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని అకడమిక్ డీన్ భరత్ రెడ్డి, నల్లగొండ జోనల్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ మనోజ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విజయోత్సవంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News