: ఇంద్రపాలనగరంలో యువనాయకుడు గణేష్ యాదవ్ సమాజ సేవా కార్యక్రమాలు
: ఇంద్రపాలనగరంలో యువనాయకుడు గణేష్ యాదవ్ సమాజ సేవా కార్యక్రమాలు
Editor Desk
రామన్న పేట స్థానిక ప్రధాన ప్రతినిధి
ఇంద్రపాలనగరం:
నిత్యం ప్రజల మధ్య ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఇంద్రపాలనగరం రైతుబిడ్డ, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్ తమ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.
జన్మదిన సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గణేష్ యాదవ్ , నిత్యం ప్రజలకు సేవలందిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని బెడ్షీట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు.ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఎదగాలన్న సంకల్పంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సుమారు 130 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు నాణ్యమైన స్పోర్ట్స్ టీ–షర్టులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది.అనంతరం కార్యకర్తలు, అభిమానుల కోసం భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ , ఉపసర్పంచ్ నల్లస్వామి జయసుధ గారు హాజరయ్యారు. వారితో పాటు వార్డ్ మెంబర్లు, దళిత సంఘాల నాయకులు, యాదవ సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, క్లాసుమేట్లు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేష్ యాదవ్ ని ఆశీర్వదించారు.
సేవా భావంతో ముందుకు సాగుతున్న యువనాయకుడి జన్మదినం గ్రామంలో సామాజిక చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి