ఇంద్రపాలనగరంలో గ్రామసభ — అభివృద్ధి, సమస్యలపై విస్తృత చర్చ
ఇంద్రపాలనగరంలో గ్రామసభ — అభివృద్ధి, సమస్యలపై విస్తృత చర్చ
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
ఇంద్రపాలనగరం:
గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇంద్రపాలనగరంలో గ్రామసభను శుక్రవారం నిర్వహించారు. సర్పంచ్ గర్దాస్ విక్రమ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామంలోని మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యలపై ప్రజల సమక్షంలో విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధతో పాటు అన్ని వార్డుల సభ్యులు పాల్గొని తమ తమ వార్డుల్లో ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చినసూచనలు,అభిప్రాయాలను నమోదు చేసి దశలవారీగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని సర్పంచ్ విక్రమ్ భరోసా ఇచ్చారు.గ్రామసభలో యువ నాయకులు, పంచాయతీ కార్యదర్శి రసూల్,గ్రామపంచాయతీ సిబ్బంది, యువ నాయకుడు సింగణబోయిన గణేష్, ఉపాధి హామీ అసిస్టెంట్, వి.బి.కే.లు, మహిళా సంఘాల అధ్యక్షులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా కార్యకర్తలు, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలు, సీనియర్ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై గ్రామాభివృద్ధిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి