ఇంద్రపాలనగరంలో సర్పంచ్కు ఘన సన్మానం – సహచర విద్యార్థుల అభినందనలు
ఇంద్రపాలనగరంలో సర్పంచ్కు ఘన సన్మానం – సహచర విద్యార్థుల అభినందనలు
Editor Desk
స్థానికం ప్రధాని ప్రతినిధి
ఇంద్రపాలనగరంలో గ్రామ సర్పంచ్గా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన గర్దాస్ విక్రమ్ ని ఆయనతో కలిసి చదువుకున్న సహచర విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. పండగను పురస్కరించుకొని సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన విక్రమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షించారు.
తమతో చదువుకున్న సహచరుడు గ్రామ సర్పంచ్గా ఎన్నిక కావడం తమకు గర్వకారణమని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బాధ్యతాయుతంగా పని చేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గర్దాస్ విక్రమ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామ ప్రజలకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. సహచరుల ప్రోత్సాహం తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుందని, గ్రామ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి