Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:44 PM

ఇందిరానగర్ రంగవల్లుల పోటీల్లో మహిళల ఉత్సాహం అభినందనీయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

ఇందిరానగర్ రంగవల్లుల పోటీల్లో మహిళల ఉత్సాహం అభినందనీయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

ఇందిరానగర్ రంగవల్లుల పోటీల్లో మహిళల ఉత్సాహం అభినందనీయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
January 12, 2026 06:26 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

భువనగిరి పట్టణం 23వ వార్డు ఇందిరానగర్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు మహిళల ఉత్సాహంతో సందడిగా సాగాయి. కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో, స్థానిక మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక–ప్రదీప్ నేతృత్వంలో అరుంధతి యూత్ కమిటీ హాల్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.

ఈ పోటీలకు హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, ప్రకృతి ప్రతిబింబించేలా అందంగా రూపొందించిన తీరు ప్రశంసనీయం అన్నారు. సంక్రాంతి సందర్భంగా నవధాన్యాలు, గొబ్బెమ్మలతో ముగ్గులు వేసి పూజలు నిర్వహించడం మన సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, వడ్డీ లేని రుణాలు, దసరా సందర్భంగా చీరల పంపిణీ వంటి పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నాయని అన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పేర్ల నమోదు కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

ముగ్గుల పోటీల్లో మొత్తం 67 మంది మహిళలు పాల్గొనగా, ప్రధమ బహుమతి వద్దిగళ్ల చిట్టి ప్రసాద్, ద్వితీయ బహుమతి గోలి స్వాతి, తృతీయ బహుమతి జల్గం సౌమ్యకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ నాయకులు, వార్డు నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News