Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:36 AM

ఇందిరానగర్ రంగవల్లుల పోటీల్లో మహిళల ఉత్సాహం అభినందనీయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

ఇందిరానగర్ రంగవల్లుల పోటీల్లో మహిళల ఉత్సాహం అభినందనీయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

ఇందిరానగర్ రంగవల్లుల పోటీల్లో మహిళల ఉత్సాహం అభినందనీయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
January 12, 2026 06:26 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

భువనగిరి పట్టణం 23వ వార్డు ఇందిరానగర్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు మహిళల ఉత్సాహంతో సందడిగా సాగాయి. కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో, స్థానిక మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక–ప్రదీప్ నేతృత్వంలో అరుంధతి యూత్ కమిటీ హాల్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.

ఈ పోటీలకు హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, ప్రకృతి ప్రతిబింబించేలా అందంగా రూపొందించిన తీరు ప్రశంసనీయం అన్నారు. సంక్రాంతి సందర్భంగా నవధాన్యాలు, గొబ్బెమ్మలతో ముగ్గులు వేసి పూజలు నిర్వహించడం మన సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, వడ్డీ లేని రుణాలు, దసరా సందర్భంగా చీరల పంపిణీ వంటి పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నాయని అన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పేర్ల నమోదు కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

ముగ్గుల పోటీల్లో మొత్తం 67 మంది మహిళలు పాల్గొనగా, ప్రధమ బహుమతి వద్దిగళ్ల చిట్టి ప్రసాద్, ద్వితీయ బహుమతి గోలి స్వాతి, తృతీయ బహుమతి జల్గం సౌమ్యకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ నాయకులు, వార్డు నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News