ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ హనుమంతరావు
ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ హనుమంతరావు
Editor Desk
హనుమపురం గ్రామంలో పూర్తి అయిన ఇండ్ల పరిశీలన
యాదాద్రి భువనగిరి, స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు.శనివారం భువనగిరి మండలం హనుమపురం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్, వివిధ దశల్లో పూర్తయిన పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులు సకాలంలో ఖాతాల్లో జమయ్యాయా లేదా అని వివరాలు సేకరించారు. మిగిలి ఉన్న పనులను కూడా వేగంగా పూర్తి చేసి, ఇండ్లలో నివాసానికి సిద్ధం కావాలని సూచించారు. అలాగే లబ్ధిదారుల కుటుంబ పరిస్థితులు, అవసరాలపై ఆరా తీశారు.ప్రభుత్వ పథకాల అమలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా సాగాలనే లక్ష్యంతో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి