Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

ఇందిరా మహిళా శక్తితో కోటి మహిళలకు కోటి ఆశలు

ఇందిరా మహిళా శక్తితో కోటి మహిళలకు కోటి ఆశలు

ఇందిరా మహిళా శక్తితో కోటి మహిళలకు కోటి ఆశలు
January 18, 2026 03:26 PM 178 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇందిరా మహిళా శక్తితో మహిళలకు ఆర్థిక స్వావలంబన

జిల్లాలో వడ్డీ లేని రుణాల పంపిణీకి సన్నాహాలు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పట్టణాల్లోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వడ్డీ లేని రుణాల పంపిణీకి సంబంధించి అన్ని మున్సిపాలిటీల్లో తేది 19.01.2026 మరియు 20.01.2026 తేదీలలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ జరిగేలా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మున్సిపాలిటీ వారీగా వడ్డీ లేని రుణాలను ఈ విధంగా మంజూరు చేసినట్లు తెలిపారు.

ఆలేరు మున్సిపాలిటీలో 375 సంఘాలకు రూ.78.87 లక్షలు, భువనగిరిలో 1170 సంఘాలకు రూ.2.99 కోట్లు, చౌటుప్పల్‌లో 591 సంఘాలకు రూ.1.28 కోట్లు, మోత్కూరులో 318 సంఘాలకు రూ.61.33 లక్షలు, పోచంపల్లిలో 528 సంఘాలకు రూ.1.11 కోట్లు, యాదగిరిగుట్టలో 344 సంఘాలకు రూ.98.23 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు.

అదేవిధంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి వివిధ బ్యాంకుల ద్వారా బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి సహకారంతో కూడా భారీగా రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. ఆలేరులో 179 సంఘాలకు రూ.15.29 కోట్లు, భువనగిరిలో 334 సంఘాలకు రూ.43.81 కోట్లు, చౌటుప్పల్‌లో 314 సంఘాలకు రూ.30.58 కోట్లు, మోత్కూరులో 106 సంఘాలకు రూ.10.48 కోట్లు, పోచంపల్లిలో 206 సంఘాలకు రూ.17.93 కోట్లు, యాదగిరిగుట్టలో 87 సంఘాలకు రూ.12.73 కోట్లు రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు రామలింగం, అంజన్ రెడ్డి, శ్రీనివాస్, సతీష్, వెంకట్రామ్ రెడ్డి, లింగ స్వామి తదితరులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News