ఇంద్రపాలనగరంలో కోతుల బెడదకు చెక్ – యువ సర్పంచ్ గర్దాస్ విక్రమ్
ఇంద్రపాలనగరంలో కోతుల బెడదకు చెక్ – యువ సర్పంచ్ గర్దాస్ విక్రమ్
Editor Desk
ఇంద్రపాలనగరంలో కోతుల సమస్యకు పరిష్కారం
గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 300 కోతుల తరలింపు
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
ఇంద్రపాలనగరం, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం:గ్రామ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇంద్రపాలనగర గ్రామంలో ప్రధాన సమస్యగా మారిన కోతుల బెడదకు పరిష్కారం దిశగా కీలక చర్యలు చేపట్టారు గ్రామ యువ సర్పంచ్ గర్దాస్ విక్రమ్.గ్రామంలో ఇళ్లపై దాడులు, పంట నష్టాలు, రోజువారీ జీవనంలో అంతరాయం కలిగిస్తున్న కోతుల సమస్యను నియంత్రించేందుకు రెండు ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసి సుమారు 300 కోతులను బంధించారు. అనంతరం అటవీ శాఖ సమన్వయంతో వాటిని అటవీ ప్రాంతాలకు సురక్షితంగా తరలిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు సర్పంచ్కు పూర్తి సహకారం అందించారు. ప్రజల భద్రత, పంటల రక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టామని సర్పంచ్ గర్దాస్ విక్రమ్ తెలిపారు. గ్రామంలో కోతుల బెడద తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తున్న యువ సర్పంచ్ చొరవకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి