ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ
ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ
స్థానికం బృందం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ధాతల చేయూత
ఇంద్రపాలనగరం స్థానిక ప్రధాన ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గకుండా చదువులో ముందుండాలన్నసంకల్పంతోఇంద్రపాలనగరంలో ఆదర్శప్రాయ కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రాథమిక పాఠశాల (గడీలబడి)లో చదువుతున్న 35 మంది విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ చేశారు.
సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆకాంక్ష మేరకు ధాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింగణబోయిన యశోద జ్ఞాపకార్థంగా ఆమె కుమారుడు సింగణబోయిన కరుణాకర్ యాదవ్ ముందుకు వచ్చి విద్యార్థులకు అవసరమైన యూనిఫాం సామగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ధాతల సహకారం మరువలేనిదని పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లజయసుధ స్వామి, వార్డు సభ్యులు, యువ నాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి