Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:20 AM

ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ

ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ

ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ
January 24, 2026 02:31 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ధాతల చేయూత

ఇంద్రపాలనగరం స్థానిక ప్రధాన ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గకుండా చదువులో ముందుండాలన్నసంకల్పంతోఇంద్రపాలనగరంలో ఆదర్శప్రాయ కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రాథమిక పాఠశాల (గడీలబడి)లో చదువుతున్న 35 మంది విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ చేశారు.

సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆకాంక్ష మేరకు ధాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింగణబోయిన యశోద జ్ఞాపకార్థంగా ఆమె కుమారుడు సింగణబోయిన కరుణాకర్ యాదవ్ ముందుకు వచ్చి విద్యార్థులకు అవసరమైన యూనిఫాం సామగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ధాతల సహకారం మరువలేనిదని పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లజయసుధ స్వామి, వార్డు సభ్యులు, యువ నాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News