ఇంద్రపాలనగరం గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ.
ఇంద్రపాలనగరం గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ.
Editor Desk
రామన్న పేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా గ్రామపంచాయతి ఆవరణలో అవగాహన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, కారులో సీట్ బెల్ట్ ధరించకపోతే కలిగే నష్టాలు, అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే ఎదురయ్యే తీవ్రమైన ప్రమాదాల గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు వివరించారు.
“మీ నిర్లక్ష్యం వల్ల మీ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి తీసుకురావద్దు” అని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ గారు సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వరికుప్పల స్వామి, పుట్టల లక్ష్మమ్మ, చిన్నలచ్చి శంకరమ్మ, రేపాక పారిజాత యాదయ్య, కప్పల మంగమ్మతో పాటు గ్రామానికి చెందిన ప్రముఖులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల మంజుల, వీబీకేలు విజయలక్ష్మి, చామంతి, హేమలత, అంగన్వాడీ సిబ్బంది మంజుల, రేణుక, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది జ్యోతి, అరుంధతి, శ్యామల, వసంత, వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి