హుజూర్నగర్లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC
హుజూర్నగర్లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
హుజూర్నగర్: హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇల్లు లేని పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ల మంజురి సంతోషకరమైన విషయమని TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తెలిపారు. ఇది పేద ప్రజలు, కార్మికులు సుదీర్ఘ పోరాటం ఫలితంగా సాధించిన విజయం అని ఆయన అన్నారు.ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 22 జనవరి 2026గా నిర్ణయించబడినప్పటికీ, పండుగల కారణంగా, కొంతమంది గ్రామాలకు వెళ్లిన కారణంగా పలు మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని TNTUC నాయకులు తెలిపారు. అందుచేత, దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 10, 2026 వరకు పొడిగించాలని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఎంఆర్వో గారికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అలాగే, సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఎండోమెంట్ భూమిపై దేవస్థానం పరికల రామస్వామి గుట్ట వద్ద పేద ప్రజలకు ఇండ్ల స్థలాన్ని పొందించడంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ కీలకమని తెలిపారు.హుజూర్నగర్ పట్టణంలోని చెరువుకట్టలు, రోడ్ల ఇరువైపులా ఇండ్లు తొలగించబడి కష్టపడిన పేద ప్రజలు, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని, ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించాల్సిన చర్యలు తీసుకోవాలని TNTUC నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో TNTUC నాయకులు ఎంకన్న, రామయ్య, నాగేశ్వరరావు, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి