Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:40 AM

హుజూర్నగర్‌లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC

హుజూర్నగర్‌లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC

హుజూర్నగర్‌లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC
January 27, 2026 07:47 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

హుజూర్నగర్: హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇల్లు లేని పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ల మంజురి సంతోషకరమైన విషయమని TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తెలిపారు. ఇది పేద ప్రజలు, కార్మికులు సుదీర్ఘ పోరాటం ఫలితంగా సాధించిన విజయం అని ఆయన అన్నారు.ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 22 జనవరి 2026గా నిర్ణయించబడినప్పటికీ, పండుగల కారణంగా, కొంతమంది గ్రామాలకు వెళ్లిన కారణంగా పలు మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని TNTUC నాయకులు తెలిపారు. అందుచేత, దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 10, 2026 వరకు పొడిగించాలని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఎంఆర్వో గారికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అలాగే, సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఎండోమెంట్ భూమిపై దేవస్థానం పరికల రామస్వామి గుట్ట వద్ద పేద ప్రజలకు ఇండ్ల స్థలాన్ని పొందించడంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ కీలకమని తెలిపారు.హుజూర్నగర్ పట్టణంలోని చెరువుకట్టలు, రోడ్ల ఇరువైపులా ఇండ్లు తొలగించబడి కష్టపడిన పేద ప్రజలు, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని, ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించాల్సిన చర్యలు తీసుకోవాలని TNTUC నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో TNTUC నాయకులు ఎంకన్న, రామయ్య, నాగేశ్వరరావు, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News