Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:50 PM

హుజూర్నగర్‌లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC

హుజూర్నగర్‌లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC

హుజూర్నగర్‌లో పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ళు మంజురి – దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించాలి. TNTUC
January 27, 2026 07:47 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

హుజూర్నగర్: హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇల్లు లేని పేద ప్రజలకు ఇంధిరమ్మ ఇళ్ల మంజురి సంతోషకరమైన విషయమని TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తెలిపారు. ఇది పేద ప్రజలు, కార్మికులు సుదీర్ఘ పోరాటం ఫలితంగా సాధించిన విజయం అని ఆయన అన్నారు.ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 22 జనవరి 2026గా నిర్ణయించబడినప్పటికీ, పండుగల కారణంగా, కొంతమంది గ్రామాలకు వెళ్లిన కారణంగా పలు మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని TNTUC నాయకులు తెలిపారు. అందుచేత, దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 10, 2026 వరకు పొడిగించాలని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఎంఆర్వో గారికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అలాగే, సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఎండోమెంట్ భూమిపై దేవస్థానం పరికల రామస్వామి గుట్ట వద్ద పేద ప్రజలకు ఇండ్ల స్థలాన్ని పొందించడంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ కీలకమని తెలిపారు.హుజూర్నగర్ పట్టణంలోని చెరువుకట్టలు, రోడ్ల ఇరువైపులా ఇండ్లు తొలగించబడి కష్టపడిన పేద ప్రజలు, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని, ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించాల్సిన చర్యలు తీసుకోవాలని TNTUC నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో TNTUC నాయకులు ఎంకన్న, రామయ్య, నాగేశ్వరరావు, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News