Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:43 AM

హుజూర్‌నగర్‌లో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర వేడుకలు

హుజూర్‌నగర్‌లో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర వేడుకలు

హుజూర్‌నగర్‌లో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర వేడుకలు
January 26, 2026 12:44 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజ్యాంగానికి ఘన నివాళి

స్థానికం ప్రధాన ప్రతినిధి

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ హుజూర్‌నగర్ పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గౌరవప్రదంగా సాగింది.

ఈ సందర్భంగా అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు మీసాల శరత్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన అపూర్వ సేవలను కొనియాడుతూ, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే మూల సూత్రాలపై ఆధారపడిన రాజ్యాంగం దేశ ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తోందని తెలిపారు.ఈ వేడుకల్లో పట్టణ సీనియర్ నాయకులు మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చింతిరాల నాగయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు మంద నాగరాజు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మంద వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీసీ నాయకులు మెల్లచెరువు ముక్కంటి పాల్గొని ప్రసంగించారు.అలాగే యాడవెల్లి వీరబాబు, దాసరి పున్నయ్య, గొట్టముక్కల రాములు, చంద్రయ్య, లచ్చయ్య, సైదులు, లక్ష్మణ్, వెంకట్, సురేష్, రవీంద్ర, రాము, వెంకటరామ్, మహేష్, నాగేష్, శ్రీను, రవి, ప్రేమ్, నరేందర్, ప్రవీణ్, సాయి, సాత్విక్, జీవన్, పండు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.రాజ్యాంగ విలువలను కాపాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని నాయకులు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News